News March 18, 2024

HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’ 

image

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

Similar News

News March 25, 2026

ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: RR కలెక్టర్

image

ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ క్లియర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్వో సంగీత, తదితరులు ఉన్నారు.

News March 25, 2026

రంగారెడ్డి జిల్లాలో 13 మంది MLAలు అయ్యే చాన్స్

image

రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 8 నియోజకవర్గాల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లో కొత్తగా శంషాబాద్ ఏర్పడనుంది. మహేశ్వరం నుంచి కొత్తగా సరూర్‌నగర్ పేరుతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్బీనగర్ నుంచి కొత్తగా హయత్‌నగర్ మరో నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కొంత భాగాన్ని దీనిలో కలిపే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి.

News March 25, 2026

రంగారెడ్డి: మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం

image

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, 6 మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు.