News January 28, 2025

హిందూపురంలో ఫిబ్రవరి 3న ఎన్నిక

image

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3న ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. ఈ నెల 30లోగా సమావేశం నిర్వహించి కౌన్సిలర్లకు సమాచారం అందజేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఆదేశించింది. 2021లో ఛైర్ పర్సన్‌గా ఎన్నికైన ఇంద్రజ కూటమి అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక లాంఛనమైంది. టీడీపీ కౌన్సిలర్ రమేశ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Similar News

News November 7, 2025

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్‌లో 50 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://munitionsindia.in/career/

News November 7, 2025

ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

image

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 7, 2025

నైట్ షిఫ్ట్ ఒత్తిడి తట్టుకోలేక 10 మందిని చంపేసిన నర్సు!

image

నైట్ షిఫ్టులతో విసుగు చెందిన ఓ నర్సు (Male) హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చి 10 మందిని చంపిన ఘటన జర్మనీలోని వుయెర్సెలెన్ ఆసుపత్రిలో జరిగింది. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలా చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు మరో 27 మందిని హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. కాగా గతంలో నిల్స్ హెగెల్ అనే మరో నర్సు కూడా 85 మందిని హత్య చేశాడు.