News January 28, 2025

టెన్త్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా ఫలితాల వివరాలను అందజేయాలని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Similar News

News November 4, 2025

మెట్‌పల్లి: మా కష్టం చూసి దేవుడూ కరగడా..?

image

ఆరుగాలం కష్టం.. అంతా వృథా. MTPL(M) మెట్లచిట్టాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపక్కన నిలబడి, కన్నీరు పెట్టుకున్నఓ మహిళా రైతు ఆవేదన ఎవరికి చెప్పేది? మొన్న తుఫాను, నిన్న మొలకలు. 2 రోజులు ఎండ వచ్చిందని ఆరబెడితే, కుప్ప అడుగుభాగంలోనే ధాన్యం మొలకెత్తింది. ‘నష్టపోయిన మాపై దేవుడికి కూడా చిన్నచూపేనా?’ అంటూ గుండెలు బాదుకుంది. కష్టపడి పండించిన ధాన్యం ఇలా పాడవడం చూసి ఆ అన్నదాత కన్నీరు ఆపడం ఎవరి వశంకాలేదు.

News November 4, 2025

అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఘనపూర్ 6.2 గోపాల్ పేట్ 7.2 వనపర్తి 6.2 ఆత్మకూరు 13.6 వీపనగండ్ల 0.8 రేవల్లి 2.8 చిన్నంబాయిలలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు. జిల్లా ఒకరోజు వర్షపాతం మొత్తం 59.6 మిల్లీమీటర్లు కాగా సగటు 4.2 మిల్లీమీటర్లు నమోదయిందన్నారు.

News November 4, 2025

గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

image

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్‌, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.