News January 28, 2025
POLITICAL: వైసీపీకి పెద్దన్న గుడివాడేనా?

ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్ఛార్జ్గా మాజీమంత్రి అమర్నాథ్కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
Similar News
News November 8, 2025
రాష్ట్రస్థాయికి ధారూర్ విద్యార్థి ఎంపిక

ఉమ్మడి RR జిల్లాలో నిర్వహించిన అండర్ 14 విభాగం క్రీడా పోటీల్లో ధారూర్ KGBV విద్యార్థిని అశ్విని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం SR నగర్లోని క్రీడామైదానంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు నిర్వహించారు. ధారూర్ కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న అశ్విని షాట్పుట్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. దీంతో SO స్రవంతి, PET శ్రీలత విద్యార్థిని అభినందించారు.
News November 8, 2025
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంపై సమావేశం

సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల విషయంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో HYDలోని ఆయన నివాసంలో శనివారం సమావేశం నిర్వహించారు. INTUC జాతీయ అధ్యక్షుడు డా.సంజీవరెడ్డి నాయకులతో కలిసి కార్మికుల హక్కులు- పరిరక్షణ, సంక్షేమం, భవిష్యత్తు వ్యూహాత్మక చర్యలు, యూనియన్ బలోపేతం గురించి చర్చించారు. నాయకులు త్యాగరాజన్, కాంపల్లి సమ్మయ్య, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, సదానందం పాల్గొన్నారు.
News November 8, 2025
వరంగల్ బల్దియాలో దోచుకుంటున్నారు..!

గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్లు, కొందరు అధికారులు ఒక్కటై రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ గ్రేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు డిప్యూటీ మేయర్ స్వయంగా లేఖలో కొందరు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు మిలాఖత్ అయి ప్రజల సోమ్ముకు ఎసరు పెడుతున్నారంటూ, తక్షణమే విచారణ జరపాలని రిజ్వానా కోరారు.


