News January 28, 2025
MDK: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలు.. గుమ్మడిదల(M)లో పాఠశాల బస్సు ఢీకొని సంతోష్ (7) అక్కడికక్కడే మృతి చెందగా.. హత్నూర(M)లో కామారెడ్డి జిల్లా వాసి నారాయణ(45)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గజ్వేల్లో బైక్ డివైడర్ను ఢీకొని మైలారానికి చెందిన స్వామి(26), సంగుపల్లికి చెందిన సదానందం(27) మృతి చెందారు. దుబ్బాకలో అప్పుల బాధతో శేర్వాణి మహేశ్(38) ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News March 3, 2026
BJP ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్

TG: BJP ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలని చూస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి BJP ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలని వికారాబాద్లో DCC అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ‘చేయి గుర్తు అంటే అభయ ముద్ర. అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే. అదే మన సిద్ధాంతం. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలి’ అని సూచించారు.
News March 3, 2026
JNTUHలో 45 మంది అధ్యాపకులకు పదోన్నతులు

JNTUHలో కెరీర్ CAS కింద 45 మంది బోధనా అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. VC డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వరరావు సమక్షంలో ఆర్డర్ కాపీలు అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్గా 9 మంది, ప్రొఫెసర్లుగా 20 మంది, అసోసియేట్ ప్రొఫెసర్గా 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ హయ్యర్ గ్రేడ్ పే పొందారు.
News March 3, 2026
RRR కస్టడీ హింసల కేసులో ట్విస్ట్

AP Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీ హింసల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IPS అధికారి సునీల్ నాయక్కు AP హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు దర్యాప్తు అధికారికి ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. కేసులో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.


