News March 18, 2024
అధికారం కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం: నరేంద్ర మోదీ

తనకు అధికారం కాపాడుకోవడం కన్నా ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, పసుపు ధరను భారీగా పెంచామన్నారు. దేశ ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.
Similar News
News March 20, 2026
కరీంనగర్: సింధీలకు ‘ఝూలేలాల్’ స్ఫూర్తి: కేంద్ర మంత్రి

సింధీలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూ దేశ ప్రతిష్టను పెంచుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో జరిగిన సింధీల నూతన సంవత్సర వేడుకలు (చేటీ చంద్)లో ఆయన పాల్గొని సందడి చేశారు. విభజన కష్టాలను అధిగమించి, ఆరాధ్య దైవం ఝూలేలాల్ జీ బాటలో సింధీ సమాజం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. అద్వానీ, అదానీ వంటి ప్రముఖులు ఈ వర్గం వారేనని ఆయన గుర్తు చేశారు.
News March 20, 2026
కరీంగర్: బడ్జెట్ అంకెల గారడీ, ప్రజలకు దగా: కేంద్ర మంత్రి

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను కాంగ్రెస్ నిలువునా వంచించిందని ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలకు పాడె కట్టిన ఈ బడ్జెట్, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా ఉందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను విస్మరించి, మైనారిటీలకు అధిక నిధులు కేటాయించడం విడ్డూరమన్నారు.
News March 17, 2026
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


