News January 28, 2025

నంద్యాల జిల్లాలో నలుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష

image

దొంగ నోట్ల కేసులో నలుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.8వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు 2017లో దొంగ నోట్లు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అందులో ఇద్దరు చనిపోగా, నలుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది.

Similar News

News November 3, 2025

ఒంటిమిట్ట రామాలయంలో TTD క్యాలెండర్లు

image

TTD 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విక్రయిస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు TTD నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయిస్తామన్నారు.

News November 3, 2025

మెగ్నీషియంతో జుట్టుకు మేలు

image

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్‌, చిక్కుళ్లు, అరటి, జామ, కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News November 3, 2025

బస్సు ప్రమాదంపై మోదీ విచారం.. పరిహారం ప్రకటన

image

TG: మీర్జాగూడ <<18184089>>ప్రమాదంపై<<>> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.