News January 28, 2025

మందమర్రిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

మందమర్రిలోని రైల్వే వంతెన కింద మంగళవారం రైలు ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 – 45 సంవత్సరాలు ఉంటుందని, ఛాతీపై రెండు పాత గాయం మచ్చలు ఉన్నాయని మంచిర్యాల జీఆర్పీ ఎస్ఐ మహేందర్ తెలిపారు. కాగా ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8328512176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News November 4, 2025

CSIR-NIOలో 24 ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(<>NIO<<>>) 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ (ఆర్కియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, BZC) ఉత్తీర్ణులు DEC 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు ఫీజులేదు. వెబ్‌సైట్: https://www.nio.res.in

News November 4, 2025

నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్

image

రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవ‌ద్ద‌నే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిల‌కు తాళి ఉన్న‌ట్లు అబ్బాయిల‌కు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివ‌క్ష లాంటిదే’ అని చెప్పారు.

News November 4, 2025

వరంగల్: రైతన్నకు నిరాశ.. తగ్గిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం మొక్కజొన్న భారీగా తరలివచ్చింది. ఈ క్రమంలో సోమవారంతో పోలిస్తే నేడు మక్కల ద్వారా తగ్గింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095 ధర రాగా, నేడు రూ.2,055 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి రూ.14,500 ధర పలికింది. దీంతో రైతన్నలు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న తడవడం, ధర సైతం తగ్గడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.