News January 28, 2025

WNP: మీ పిల్లలు ఏ కళాశాలలో ఎక్కడ చదువుతున్నారు..?

image

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ విద్యా శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారు అనే వివరాలను ఇంటర్ బోర్డ్ సేకరిస్తుంది. ఎక్కడ ఏ కళాశాలలో చదువుతున్నారు అనే సమాచారాన్ని పంపించాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా ఇంటర్ కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సమాచారం సేకరిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.

Similar News

News January 17, 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాకు నేడు CM రేవంత్‌

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య అందుబాటులోకి రానుందని నిపుణులు అంటున్నారు.

News January 17, 2026

సావిత్రి గౌరీ నోము ఎలా ఆచరించాలి?

image

మట్టితో చేసిన దేవతా మూర్తుల బొమ్మలను ఓ పీఠంపై ఉంచి, వాటి మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజించాలి. నూతన వధువులు ఈ వ్రతాన్ని వరుసగా 9 రోజుల పాటు భక్తితో ఆచరిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. రోజూ అమ్మవారికి 9 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పండ్లు, తాంబూలం వాయనంగా ఇవ్వాలి. తొమ్మిదో రోజు పూజ పూర్తయ్యాక, ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేయాలి.

News January 17, 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాకు నేడు CM రేవంత్‌

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య అందుబాటులోకి రానుందని నిపుణులు అంటున్నారు.