News January 28, 2025
WNP: మీ పిల్లలు ఏ కళాశాలలో ఎక్కడ చదువుతున్నారు..?

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ విద్యా శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారు అనే వివరాలను ఇంటర్ బోర్డ్ సేకరిస్తుంది. ఎక్కడ ఏ కళాశాలలో చదువుతున్నారు అనే సమాచారాన్ని పంపించాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా ఇంటర్ కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సమాచారం సేకరిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ పోలింగ్ అప్డేట్స్

✦ మ.3 గంటల వరకు 40.20% ఓటింగ్ నమోదు.. సా.6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
✦ కాంగ్రెస్ నేతలు నగదు పంచుతూ ఓటర్లను భయపెడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న వారి సంగతి 14వ తేదీన చెప్తా: మాగంటి సునీత
✦ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఆచరించేది కాంగ్రెస్.. ఓడిపోతున్నామని అసహనంతో BRS అభ్యర్థి మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం
News November 11, 2025
రాజమండ్రి, కాకినాడ రైళ్లు రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 20న నాలుగు రైళ్లను రద్దు చేశారు. కాకినాడ పోర్ట్-విశాఖ(17267), విశాఖ-కాకినాడ పోర్ట్(17268), రాజమండ్రి-విశాఖ(67285), విశాఖ-రాజమండ్రి(67286) రైళ్లు ఆ తేదీన తిరగవు. ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.
News November 11, 2025
వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it


