News March 18, 2024
శ్రీకాకుళం: బార్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి భాయి

హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆమదాలవలస బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా కనితి విజయలక్ష్మి భాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాధు ధనుంజయరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికైన తొలి మహిళ అధ్యక్షురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. ఉపాధ్యక్షులుగా రమణమూర్తి, కార్యదర్శిగా ఎ.విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా బీ.మోహన్రావు ఎన్నికైనట్లు ప్రకటించారు.
Similar News
News April 10, 2025
శ్రీకాకుళం DMHOగా సుజాత

శ్రీకాకుళం జిల్లా DMHOగా డాక్టర్. బి.సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు DMHOగా పనిచేసిన బాలమురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. సుజాత ప్రస్తుతం విశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
News April 10, 2025
నరసన్నపేట : ముగ్గుల పోటీల్లో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ

ముగ్గుల పోటీలలో నరసన్నపేటకు చెందిన మహిళ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆన్లైన్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో సునీత మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్షల రూపాయలు గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
News April 10, 2025
మెళియాపుట్టి: విషం తాగి వృద్ధుడు ఆత్మహత్య

మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యనారాయణ (82) మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యం నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు బుధవారం ఎస్సై పి.రమేశ్ బాబు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.