News January 28, 2025
కామారెడ్డి : ఢిల్లీలో తెలంగాణ కళారూపాలు

తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం ఢిల్లీ వాసులను మంత్రముగ్ధులను చేశాయి. మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో TGకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2025’లో భాగంగా పేరిణి నాట్యాన్ని ప్రదర్శించారు.TG ప్రఖ్యాత కళాకారులు పేరిణి ప్రకాశ్ నేతృత్వంలో TG సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దీపిక పేరిణి బృందంలో పాల్గొనడం జిల్లాకు గర్వకారణమని కామారెడ్డి కళాకారులు అన్నారు.
Similar News
News September 14, 2025
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన శ్రీలంక

ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాపై శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 139/5 రన్స్ మాత్రమే చేసింది. జాకిర్ అలీ (41*), షమీమ్ హుస్సేన్(42*) మాత్రమే రాణించారు. లంక బ్యాటర్లు 32 బంతులు మిగిలుండగానే మ్యాచ్ని ముగించేశారు. నిస్సంక హాఫ్ సెంచరీ, కమిల్ మిషారా(46*), కెప్టెన్ అసలంక(10*) రాణించారు. బంగ్లా బౌలర్స్ మహేదీ హసన్ 2, ముస్తఫిజుర్, తన్జిమ్ చెరో వికెట్ తీశారు.
News September 14, 2025
కరీంనగర్ పీఏసీఎస్ లో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు డిఏఓ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడోద్దన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News September 14, 2025
KNR: సహకార సంఘాలకు పర్సన్ ఇన్ చార్జీల నియామకం

KNR జిల్లాలోని 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 సంఘాలకు గాను, 27 సంఘాలకు పాత PIC లనే కొనసాగిస్తూ, ఊటూర్, ఆర్నకొండ, గట్టుదుద్దెనపల్లి సంఘాల పదవీకాలాన్ని తిరిగి పొడిగించకుండా, వారిస్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్ చార్జీలను నియమించారు.