News January 28, 2025
జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల దృష్ట్యా జగిత్యాల జిల్లాలో 5 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వహణధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో (వెల్గటూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాలు మినహాయించి) ఉన్న గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందదన్నారు.5 రోజులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
Similar News
News November 9, 2025
వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు: అదనపు కలెక్టర్

హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాలో 24 కంపెనీలు పాల్గొనగా 682 మంది యువతీ యువకులు నమోదు చేసుకున్నారు. వీరిలో 214 మందికి ఉద్యోగాలు దక్కాయి. వృత్తి విద్యతో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉపాధి పొందాలని అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి సూచించారు.
News November 9, 2025
ఇతిహాసాలు – 61 సమాధానం

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
జవాబు: కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులు మరణించడంతో ఆ బాధ, కోపంతో శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమవ్వాలని గాంధారీ శపించింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆయన పాండవుల విజయానికి పరోక్షంగా కారణమయ్యాడని నిందిస్తూ.. యాదవ వంశం కలహాలతో నశించిపోతుందని, కృష్ణుడు ఒంటరిగా చనిపోతాడని శపించింది. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 9, 2025
వారంలో టెట్ నోటిఫికేషన్?

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.


