News January 28, 2025

భూపాలపల్లి: ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం 

image

తెలంగాణ మైనారిటీస్ గురుకుల పాఠశాల & కళాశాలలో ఖాళీగా ఉన్న గణిత శాస్త్రం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అధికారి శైలజ పేర్కన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు మైనార్టీ గురుకుల పాఠశాల & కళాశాలలో బయోడేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.

Similar News

News September 14, 2025

ఖమ్మంలో లోక్ అదాలత్.. 597 కేసులు పరిష్కారం

image

ఖమ్మం జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ప్రారంభించారు. లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఆయన చెప్పారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 4,746 కేసులను గుర్తించగా, వాటిలో 597 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల గొడవలు, ఆస్తి వివాదాలు, బ్యాంక్ రికవరీ, రోడ్డు ప్రమాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు

News September 14, 2025

మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

image

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.

News September 14, 2025

నిర్మల్: ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్ల గడువు పెంపు

image

2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ స్కూల్స్ లో ప్రవేశాల గడువును ఈ నెల 18 వరకు పొడిగించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆలస్య రుసుము అవసరం లేదని తెలిపారు. 19, 20 తేదీలలో ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని కోరారు.