News March 18, 2024

మల్కాజిగిరిలో పాగా వేసేదెవరో?

image

గత MP ఎన్నికల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు 6,03,748 ఓట్లు రాగా BRS అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి 5,92,829 ఓట్లు, BJP అభ్యర్థి రాంచందర్‌రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. BRS తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించగా BJP నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.

Similar News

News April 20, 2025

HYD: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

image

క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయరలో ఆదివారం కొందరు యువకులు క్రికెట్ కోసం త్యాగి వెన్యూ గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ (32) ఒక్కసారి కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందినట్లు తెలుస్తోంది.

News April 20, 2025

HYDలో 2 దశాబ్దాల తర్వాత పోరు!

image

HYD స్థానిక కోటా MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత 22 ఏళ్లుగా ఈ స్థానం ఏకగ్రీవమే. ఈ సారి పోటీకి BJP సిద్ధమవడం విశేషం. ఈ కోటాలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. INC ఎన్నికకు దూరం ఉండగా.. BRS ఏకంగా పోలింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23న MIMతో BJP పోటీ పడుతోంది.

News April 20, 2025

HYD: కూతురికి విషం ఇచ్చి తల్లి సూసైడ్ అటెంప్ట్

image

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. 4 సంవత్సరాల కూతురు జేష్వికకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరినీ KPHBలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చిన్నారి మృతి చెందగా ప్రస్తుతం తల్లికి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య సమస్యలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!