News January 28, 2025
తెలుగమ్మాయి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మచిలీపట్నానికి చెందిన సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2014లో ఎస్తేర్ను చంద్రభాను ముంబైలో హత్యాచారం చేసినట్టు నిర్ధారించిన ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో హైకోర్టు కూడా సమర్థించింది. నిందితుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా చంద్రభాను హత్యచేసినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందంటూ అతడిని నిర్దోషిగా తేల్చింది.
Similar News
News January 11, 2026
APPLY NOW: NABARDలో 44 పోస్టులు

<
News January 11, 2026
‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజాసాబ్’ సినిమా భారత్లో రెండు రోజుల్లో ₹108.4కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెబ్సైట్ పేర్కొంది. ప్రీమియర్లకు ₹11.3Cr, తొలి రోజు ₹64.3Cr, రెండో రోజు ₹32.84Cr కలెక్షన్స్ వచ్చినట్లు వెల్లడించింది. హిందీలో 2 రోజుల్లో ₹11.2Cr రాబట్టినట్లు తెలిపింది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹112Cr+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 11, 2026
ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.


