News January 29, 2025
MBNR:మన్యం కొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష

మన్యం కొండ దేవస్థానం ప్రతిష్ఠను పెంచే విధంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసిలో మన్యంకొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,SP డి.జానకి పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
పాలమూరు:ఉచిత శిక్షణ.. రేపే లాస్ట్!

ఉమ్మడి MBNR జిల్లాలోని గ్రామీణ యువకులకు SBI,RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్ & సర్వీసింగ్ కోర్సులలో ఈనెల 19 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందని, 19-45లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 18లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 99633 69361 సంప్రదించాలన్నారు.
News January 16, 2026
MBNR: రేపు సీఎం రాక.. భారీ బందోబస్తు

మహబూబ్నగర్కు సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ-1, అడిషనల్ ఎస్పీలు-7, డీఎస్పీలు-10, సీఐలు-34, ఎస్సైలు-77, ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు-182, పీసీలు/వుమెన్ పీసీలు-741, హోంగార్డులు-110, వుమెన్ పీసీలు/వుమెన్ హోంగార్డులు-22, మొత్తం 1,184 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో హాజరుకానున్నారు.
News January 16, 2026
MBNR:CM పర్యటన..ట్రాఫిక్ మళ్లింపు2/2

1.జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు
→SVS హాస్పిటల్ ముందు నుండి, RTC బస్టాండ్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా రాయచూర్ రోడ్డు చేరుకోవచ్చు.
2.నాగర్కర్నూల్ నుంచి MBNR టౌన్లోకి వచ్చే వాహనాలు
→భూత్పూర్ ఫ్లైఓవర్ క్రింది భాగంలో లెఫ్ట్ తీసుకొని, తాటికొండ మీదుగా మహబూబ్నగర్ టౌన్లోకి రావచ్చు.
3.కర్నూల్ నుంచి మహబూబ్నగర్ వచ్చే వాహనాలు
→NH-44 నందు తాటికొండ మీదుగా మహబూబ్నగర్ టౌన్లోకి ప్రవేశించవచ్చు.


