News January 29, 2025
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: జీసీసీ ఛైర్మన్

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అనంతగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందని దుయ్యబట్టారు. దానికి భిన్నంగా నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News November 15, 2025
బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి: కలెక్టర్

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో సూర్యలంక బీచ్, రామాపురం బీచ్లకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారని, అక్కడ రిసార్ట్లు బాగా అభివృద్ధి చెందాయని, పరిసరాలను ఎల్లవేళలా పరిశ్రమంగా ఉంచి, పర్యాటకులను ఆకర్షించాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా జిల్లాకు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుందని తద్వారా జీడీపీ రేటు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 15, 2025
మూవీ ముచ్చట్లు

* Globetrotter ఈవెంట్లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె


