News January 29, 2025
సంగారెడ్డి: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా జయరాజ్

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సంగారెడ్డికి చెందిన జయరాజ్ను రాష్ట్ర మహాసభల్లో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, రైతు సంఘాల్లో కూడా బాధ్యతలు చేపట్టారు. జయరాజ్ మాట్లాడుతూ.. తనకు మొదటిసారిగా రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 8, 2025
ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు BIG ALERT

దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 13, 14, 15, 16 వెర్షన్ల(ఫోన్స్, ట్యాబ్లెట్స్)లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, ఇవి హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. శామ్సంగ్, వన్ప్లస్, షియోమీ, రియల్మీ, మోటోరోలా, వివో, ఒప్పో, గూగుల్ పిక్సల్ ఫోన్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. వెంటనే వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 8, 2025
పల్నాడు: నందికొండ పేరు ఎలా వచ్చిందో తెలుసా.!

పురాణాలలో పల్నాడు ప్రాంతాల ప్రస్తావన ఉంది. దక్షయజ్ఞ ధ్వంసం అనంతరం సతీ వియోగంతో శివుడు విసిగిపోయాడు. దీంతో అంగలు-పంగాలు వేసుకుంటూ తన వాహనమైన నందిని ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాంతంలో విడిచిపెట్టగా ఆ నంది నందికొండగా పేరు వచ్చింది. శిరమున ఉన్న చంద్రవంకను మాచర్ల ప్రాంత అడవులలో విడిచి పెట్టగా నేటి చంద్రవంక నదిగా మారింది. మెడలో నాగుపామును కనుముల ప్రాంతంలో విడిచి పెట్టగా అది నాగులేరుగా మారిందని ప్రతీతీ.
News November 8, 2025
GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.


