News January 29, 2025
సిద్దిపేట: 100 శాతం పన్నులు వసూలు చేయాలి: అదనపు కలెక్టర్

సిద్దిపేట జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ టాక్స్, షాప్ రెంట్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయలన్నారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
మార్చి 16 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు: కలెక్టర్

ఉన్నత చదువులకు తొలి మెట్టైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివరాలు శుక్రవారం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడంతో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు పాటు పడాలన్నారు.
News February 27, 2026
పార్వతీపురం: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 413 మంది గైర్హాజర్

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు DVEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్ధులు 840 మందికి 80 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,957 మందికి 333 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు.
News February 27, 2026
సీఎంలుగా చేసి ఇతర పార్టీల్లోకి జంప్!

ఒక పార్టీ నుంచి రాష్ట్రానికి CMగా వ్యవహరించినా రాజకీయ సమీకరణాలు, అవకాశాల కోసం పలువురు పార్టీ మారడానికి వెనకాడటం లేదు. తాజాగా TN మాజీ సీఎం <<19250954>>పన్నీర్ సెల్వం<<>> DMKలో చేరారు. INC నుంచి CMలుగా చేసిన అశోక్ చవాన్(మహారాష్ట్ర), కిరణ్కుమార్రెడ్డి(AP), అమరీందర్(పంజాబ్) BJPలో చేరారు. చంపై సోరెన్(ఝార్ఖండ్) JMM నుంచి BJPలోకి వెళ్లారు. జగదీశ్ షెట్టర్(కర్ణాటక) BJP నుంచి INCలోకి వెళ్లి మళ్లీ సొంతగూటికి చేరారు.


