News January 29, 2025
సౌదీలో రోడ్డు ప్రమాదం.. మెట్పల్లి వాసీ మృతి

సౌదీలో రోడ్డు ప్రమాదంలో మెట్పల్లిలోని రేగుంటకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. కాపెల్లి రమేశ్ (30) మూడు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులకోసం మినీ బస్సులో ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు ఢీకొన్నాయి. ఇందులో 15 మంది చనిపోయారు. ఇందులో కాపెల్లి రమేశ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన మరోముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News July 7, 2025
చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.
News July 7, 2025
జూబ్లీహిల్స్ కోసం దండయాత్ర!

జూబ్లీహిల్స్ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.
News July 7, 2025
జూబ్లీహిల్స్ కోసం దండయాత్ర!

జూబ్లీహిల్స్ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.