News January 29, 2025
రుద్రంగి: ఆన్లైన్ బెట్టింగ్లో నష్టం.. అద్దె ఇంట్లో చోరీ

బెట్టింగ్లకు అలవాటుపడి ఓ యువకుడు డబ్బుల కోసం అద్దె ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిపేట SI రమాకాంత్ కథనమిలా.. రుద్రంగికి చెందిన కాసోజ్ విజయ్, బందారపు గంగిరెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే చోరీ చేశాడు. 4 తులాల బంగారు గొలుసు, అర తులం చైన్ ఎత్తుకెళ్లాడని ఎస్సై తెలిపారు.
Similar News
News July 6, 2025
పెద్దపల్లి: జీవో నెంబర్ 282ను రద్దు చేయాలి

జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం CITU ఆధ్వర్యంలో జీవో నెంబర్ 282 ప్రతులను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమశక్తిని దోచి, కార్పొరేట్లకు అధిక లాభాలను కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని నాయకులు అన్నారు. 8గంటల పని విధానాన్ని 10గంటలుగా మారుస్తూ చేసిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
News July 6, 2025
NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.
News July 6, 2025
రేపు ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో నకిలీ విత్తనాలతో పంటకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం సీతక్క మంగపేట, ఏటూరునాగారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.