News March 18, 2024
రాహుల్ చెప్పింది నా గురించి కాదు: చవాన్

మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత బీజేపీలో చేరే ముందు తన తల్లి వద్దకు వచ్చి ఏడ్చారని రాహుల్ గాంధీ తాజాగా వ్యాఖ్యానించారు. అది ఆ రాష్ట్ర మాజీ సీఎం చవానేనంటూ వార్తలు వచ్చాయి. వాటిపై చవాన్ స్పందించారు. ‘ఆ మాటలు నా గురించే అయితే అవి నిరాధారం. నేను అసలు సోనియాతో మాట్లాడలేదు. నేను రాజీనామా చేసే వరకు విషయం ఎవరికీ తెలియదు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలా మాట్లాడారు’ అని తెలిపారు.
Similar News
News July 8, 2025
‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ కల్చర్తో ఫ్యూచర్ ఢమాల్!

కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి కాపాడుకోవడమే ప్రస్తుతం గగనమైపోయింది. ఇలాంటి సమయంలో కొందరు క్షణికావేశంలో యాజమాన్యాలకు చెప్పకుండానే ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లకపోవడం, మెయిల్స్కు స్పందించకుండా నెగ్లెక్ట్ చేయడాన్ని ‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ అంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఉద్యోగి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ఇలా చేస్తే ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.
News July 8, 2025
ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్

ఇంగ్లండ్ U19తో జరిగిన చివరి వన్డేలో భారత్ U19 చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది. అంబ్రిష్(66), సూర్యవంశీ(33) ఫర్వాలేదనిపించినా మిగిలిన అందరూ విఫలమయ్యారు. తర్వాత ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. అయితే అంతకుముందు 3 మ్యాచ్లు గెలిచిన భారత్ 3-2తో సిరీస్ను సొంతం చేసుకుంది.
News July 8, 2025
ట్రంప్ టారిఫ్స్ లేఖలు: మొదట ఈ దేశాలకే..

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వడ్డన మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపుతున్నారు. మొదటగా జపాన్, సౌత్ కొరియాలకు 25% టారిఫ్స్ విధించారు. జపాన్ PM ఇషిబా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జేకు పంపిన లేఖలను ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా తక్కువ’ అని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్నారు. దీంతో తర్వాత ఏయే కంట్రీస్కు ఎంత విధిస్తారో అన్న ఆందోళన మొదలైంది.