News January 29, 2025

TIRUMALA: నేరుగా స్వామివారి దర్శనం

image

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్వామివారి దర్శనం నేరుగా లభిస్తోంది. కాగా.. శ్రీవారిని నిన్న 70,610 మంది దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. వారిలో 17,310 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. ఇక స్వామివారికి హుండీ ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం సమకూరింది.

Similar News

News April 16, 2026

యుద్ధానికి సిద్ధపడుతున్న ఇరాన్?

image

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ఓవైపు పాక్ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్‌లో పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి స్కూళ్లకు వర్చువల్ లెర్నింగ్‌ అమలు చేయనుంది. స్కూళ్లపైనా గతంలో <<19620831>>దాడులు<<>> జరిగిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మిస్సైల్ కేంద్రాల మరమ్మతులను ఇరాన్ ముమ్మరం చేసింది.

News April 16, 2026

రాష్ట్రమంతటిపై ‘అమరావతి’ భారం: సజ్జల

image

AP: అమరావతి పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్లు దోచుకుంటున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘CBN చేస్తున్నది సంపద సృష్టికాదు దోపిడీ. ఇతర చోట్ల ఇటువంటి నిర్మాణాలకు Sftకి ₹3వేలలోపు ఉంటే ఇక్కడ ₹14వేలు ఖర్చు చేస్తున్నారు. హైరైజ్డ్ పేరిట 40-50 అంతస్తులు కడుతూ మొబిలైజేషన్ అడ్వాన్సులిస్తున్నారు. ఇదంతా మోయలేని భారం. ఆ ఖర్చును రాష్ట్రమంతా భరించాలంటున్నారు’ అని పార్టీ BC నేతల భేటీలో విమర్శించారు.

News April 16, 2026

రామాయణ ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుంది: యశ్

image

‘రామాయణ’ VFXపై విమర్శలు వస్తున్న వేళ యశ్ కామెంట్స్‌ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి పనిచేస్తున్నది ప్రతిష్ఠాత్మక DNEG కంపెనీ అని, ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుందని అన్నారు. గ్రాఫిక్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. కాగా DNEG డ్యూన్-2, టెనెట్, ఇంటర్‌స్టెల్లార్ వంటి బ్లాక్‌బస్టర్లకు గ్రాఫిక్స్ అందించింది. ఈ నేపథ్యంలో సినిమా ఔట్‌పుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.