News January 29, 2025
నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట: అఖిలేశ్ యాదవ్

మహా కుంభమేళాలో తొక్కిసలాటలో భక్తులు మరణించడం చాలా బాధాకరం అని ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించాలన్నారు. ఈ ఘటన నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తుల కోసం వసతి, భోజనం, నీటి సౌకర్యాలకు అదనపు ఏర్పాట్లు చేయాలని ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Similar News
News September 17, 2025
ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

అవసరమైతే ఆసియా కప్ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్ను ICC తిరస్కరించింది.
News September 17, 2025
IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<
News September 17, 2025
ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.