News March 18, 2024
బాలికపై DSP అత్యాచారం

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసే ఓ మైనర్ (15)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. DSP హోదాలో లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నిందితుడు కిరణ్ నాథ్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తనను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడటమే కాక కుటుంబసభ్యులతో కలిసి చిత్రహింసలకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Similar News
News August 28, 2025
TODAY HEADLINES

✷ తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
✷ వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్మెంట్: CM రేవంత్
✷ అర్హులెవరికీ అన్యాయం జరగదు: AP CM చంద్రబాబు
✷ APలో భారీ వర్షాలు.. నీటి ప్రాజెక్టులకు భారీగా వరద
✷ భారత్ మంచితనం.. పాక్లో 1.50 లక్షల మంది సేఫ్
✷ అమల్లోకి వచ్చిన 50% టారిఫ్స్
✷ IPLకు అశ్విన్ రిటైర్మెంట్
News August 28, 2025
అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.
News August 27, 2025
ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.