News January 29, 2025
భారత స్టాక్మార్కెట్లకు టైమొచ్చింది: మోర్గాన్ స్టాన్లీ

భారత స్టాక్మార్కెట్లలో రివర్సల్కు టైమొచ్చిందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు పేర్కొంది. చాలా అంశాలు పటిష్ఠ రికవరీని సూచిస్తున్నాయంది. ‘గ్రోత్ తగ్గడం మార్కెట్లపై ప్రభావం చూపింది. త్వరలోనే గ్రోత్ పెరుగుతుందని మా విశ్వాసం. ఫోర్స్ఫుల్ సెల్లింగ్ తగ్గింది. పడిపోతున్న ట్రేడింగ్ వాల్యూమ్స్ దీనినే సూచిస్తున్నాయి. ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు బెస్ట్ రిస్క్ రివార్డు ఆఫర్ చేస్తున్నాయి’ అని పేర్కొంది.
Similar News
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.