News January 29, 2025

విశాఖ: ఆసక్తి గలవారు అప్లే చేసుకోండి..! 

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ సహాయకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ తెలిపారు. పదో తరగతి పూర్తయిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తుతో పాటు, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత ధ్రువపత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో జిల్లా కోర్టులో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో జనవరి 31 లోపు అందజేయాలన్నారు. ఎటువంటి జీతం ఉండదని తెలిపారు.

Similar News

News November 6, 2025

విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ!

image

విశాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్‌ పేపర్‌ లైసెన్స్‌ వెండర్లు, డాక్యుమెంట్‌ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దళారీ వ్యవస్థను పెకిలించాలని కోరుతున్నారు.

News November 6, 2025

విశాఖ: ఆదాయంలో సూపర్‌ బజార్‌‌ సబ్ రిజిస్ట్రార్ టాప్

image

ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖలోని 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది. మొదటి 7 నెలల్లోనే సుమారు రూ.600 కోట్ల ఆదాయం నమోదైనట్లు సమాచారం. సూపర్‌ బజార్‌, మధురవాడ కార్యాలయాలు అత్యధిక ఆదాయం సాధించగా.. అనందపురం, భీమునిపట్నం కార్యాలయాలు తక్కువ ఆదాయంతో చివర్లో నిలిచాయి. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలో పూర్తి కానుండడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.

News November 6, 2025

11వ తేదీ నుంచి డాక్‌యార్డ్ బ్రిడ్జి పై రాకపోకలు: MLA

image

సరిగ్గా 20 నెలల క్రితం మూసివేసిన డాక్ యార్డ్ బ్రిడ్జి పోర్టు యాజమాన్యం సహకారంతో పునర్నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రాకపోకలు చేయవచ్చని తెలిపారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో ‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. అన్ని రహదారుల పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. భద్రత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.