News January 29, 2025

చాగంటికి అవమానం అంటూ ప్రచారం.. TTD ఫిర్యాదు

image

AP: చాగంటి కోటేశ్వర‌రావుకు తిరుమలలో అవమానం జరిగిందని ప్రచారం చేసిన SM ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు TTD వెల్లడించింది. ఆయనకున్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రకారం JAN 14న దర్శనం చేయించామంది. అవాస్తవాలు ప్రచారం చేసినందుకు పోలీసు కేసుతో పాటు PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. TTD ప్రతిష్ఠను పలుచన చేసేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

Similar News

News December 29, 2025

7 ఏళ్లకే చెస్ ఛాంపియన్‌.. ఈ చిన్నారి గురించి తెలుసా?

image

ఏడేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞిక గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ చిన్నారిని రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఈ ఏడాది సెర్బియాలో జరిగిన “FIDE వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్-2025″లో U-7 బాలికల విభాగంలో స్వర్ణం సాధించింది. “నేను బెస్ట్ చెస్ ప్లేయర్ అవుతా” అని ఆమె మోదీతో చెెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ గుజరాత్‌లో స్థిరపడింది.

News December 29, 2025

ఢిల్లీ హైకోర్టుకు Jr.NTR స్పెషల్ థాంక్స్

image

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు ప్రొటెక్టివ్ ఆర్డర్ పాస్ చేసిన ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు, వాణిజ్య అవసరాలకు అనుమతి లేకుండా తమ ఫొటోలు వాడటంపై పవన్ కళ్యాణ్, <<18640929>>Jr.NTR<<>> ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లను వేసిన విషయం తెలిసిందే.

News December 29, 2025

వీరిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకం!

image

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి కోసం అందించే వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. లక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. అర్హులైన వారు వివాహమైన ఏడాదిలోపు <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేయాలి. జిల్లా కలెక్టర్ ఆమోదంతో సంక్షేమ అధికారులు ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. SHARE IT