News January 29, 2025
30ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి: సీఎం హర్షం

AP: రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై CM చంద్రబాబు, Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై CM అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత RD పరేడ్లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు, హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన, బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి SMలో సైతం పెద్దఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.
Similar News
News February 3, 2026
OTR అప్డేట్ చేయకపోతే అవకాశం కోల్పోతారు!

TG: త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో TGPSC కీలక ప్రకటన చేసింది. కమిషన్లో నమోదైన 31.56 లక్షల మంది తప్పనిసరిగా తమ OTR (వన్టైమ్ రిజిస్ట్రేషన్) వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది. వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, తాజా ఫొటో, సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. అప్డేట్ చేయకపోతే భవిష్యత్ నియామకాలకు దరఖాస్తు చేసుకోలేరని హెచ్చరించింది.
News February 3, 2026
ఈ నెల 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు FEB 26- MAR 2 వరకు జరగనున్నాయి. FEB 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, FEB 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, మార్చి 1, 2న మలయప్పస్వామి పుష్కరణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. FEB 26, 27న సహస్రదీపాలంకార సేవ, FEB 28, MAR 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.
News February 3, 2026
పూజ గదిలో ఉండకూడని విగ్రహాలు

పూజ గదిలో నిలబడి ఉన్న లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడి విగ్రహాలు, ఉగ్ర రూప మూర్తులు ఉంచకూడదు. అలా ఉంటే సంపద నిలవదని అంటారు. ఎత్తుగా ఉండే విగ్రహాలు కూడా అరిష్టమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పెద్ద విగ్రహాల ఆకర్షణ శక్తిని ఇల్లు భరించలేదు కాబట్టి వాటిని గుడికే పరిమితం చేయాలంటున్నారు. మరణించిన వారి ఫొటోలు సైతం పూజా మందిరంలో పెట్టకూడదట. తద్వారా దైవాగ్రహానికి గురై శాంతి, ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.


