News January 29, 2025
ఎన్టీఆర్: డిగ్రీ వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(Y15 నుంచి Y17 బ్యాచ్లు) 4వ సెమిస్టర్ వన్ టైం ఆపర్చ్యూనిటీ థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 20లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మార్చి 25 నుండి నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.
Similar News
News March 2, 2026
కర్నూలు @ 36°C

కర్నూలు జిల్లాలో ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కర్నూలులో గరిష్ఠంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 2, 2026
ఉపాధి హామీలో ముంచింగిపుట్టు మండలం ఫస్ట్

ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేయడంలో ఈ ఏడాది ముంచింగిపుట్టు మండలం ప్రథమం స్థానంలో నిలిచిందని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు. ఈ మండలంలో నిర్దేశించిన లక్ష్యంలో 99.4% పనులు పూర్తి కాగా, అరకువ్యాలీలో 99%, అనంతగిరిలో 89% పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. 60%తో చివరి స్థానంలో మారేడుమిల్లి మండలం నిలించిందన్నారు. జిల్లాలో 1,08,35,415 పని దినాలు పూర్తియన్నారు.
News March 2, 2026
మార్కెట్ల బ్లడ్బాత్.. రూ.8లక్షల కోట్లు ఆవిరి

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1498, నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపడుతుండటంతో రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు 6శాతం, ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 5శాతం కోల్పోయాయి. డిఫెన్స్ షేర్లు పుంజుకున్నాయి.


