News March 18, 2024
UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.
Similar News
News September 6, 2025
గణేశ్ మహా నిమజ్జనానికి GHMC అన్ని ఏర్పాట్లు

గ్రేటర్ HYDలో నేడు గణేశ్ మహా నిమజ్జనం జరుగనుంది. నిమజ్జనం సజావుగా సాగేందుకు GHMC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్, ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమం సాఫీగా జరగడానికి చర్యలు తీసుకుంది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ 15వేల మంది సిబ్బందితో 24×7 పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతోంది. నగర వ్యాప్తంగా శోభాయాత్రలను మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిమజ్జనాన్ని మానిటర్ చేస్తున్నారు.
News September 6, 2025
ఖైరతాబాద్ గణపతికి శోభయాత్ర రూట్ మ్యాప్

ఖైరతాబాద్ మహా గణపతికి కమిటీ సభ్యుడు రాజ్కుమార్ కలశ పూజ చేశారు. కొద్దిసేపట్లో మహా గణపతి గంగమ్మఒడికి బయలుదేరనున్నారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు చేరుకోనుంది. బడా గణేశ్ – సైఫాబాద్ ఓల్డ్ పీఎస్- ఇక్బాల్ మినార్- తెలుగుతల్లి ఫ్లైఓవర్- అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్కు చేరుకోనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్కు తరలివస్తున్నారు.
News September 6, 2025
వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీర్బాగ్ జంక్షన్లో మాత్రమే అనుమతి

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత డైవర్షన్లు అమలు చేశారు. ప్రధాన రూట్లు బారికేడ్లతో మూసివేయగా, వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీర్బాగ్ జంక్షన్లో మాత్రమే వాహనాలకు అనుమతించారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, కోటి, లిబర్టీ, ట్యాంక్బండ్, రాణీగంజ్ వంటి ప్రాంతాల్లో కీలక మార్గమార్పులు అమలులో ఉంటాయి. పౌరులు IRR, ORR వినియోగించాలని పోలీసులు సూచించారు.