News March 18, 2024
UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.
Similar News
News January 16, 2026
ఫోర్త్ సిటీలో ఎగిరే టాక్సీలు.. స్కైరైడ్ సిద్ధం!

HYDకు ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు (eVTOL) హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్లు కూడా. యాప్లో బుక్ చేస్తే ఇంటి మీద ఆగుతాయి. ఫోర్త్ సిటీనుంచి 10MINలో సైలెంట్గా ఎయిర్పోర్టుకు వెళ్లొచ్చు.
News January 16, 2026
HYDలో డ్రోన్ల జాతర.. నేడు హై-వోల్టేజ్ స్కై షో!

గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఎక్స్పో 2026 నేడు ప్రారంభం కానుంది. వెయ్యి డ్రోన్లతో ఆకాశంలో ప్రదర్శించే అద్భుత ఆకృతులు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ షోకు ఫ్రీ ఎంట్రీ. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, రేసింగ్ను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా సందర్శకులు ముందుగానే రావాలని నిర్వాహకులు సూచించారు. సంక్రాంతి సందడిని టెక్నాలజీతో జరుపుకోండి.
News January 16, 2026
GHMC రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు 40% స్థానాలు

GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు 122 స్థానాలు కేటాయించారు. పురుషులు, మహిళలకు సమానంగా చెరో 61 సీట్లు ఇచ్చారు. SCలకు 23 (M-12, F-11), STలకు 5 (M-3, F-2) స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 76, అన్రిజర్వుడ్గా 74 స్థానాలు ప్రకటించారు. మొత్తంగా మహిళలకు 150 స్థానాలు దక్కాయి.


