News January 29, 2025

శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. ఇప్పుడు మరింత మెలకువగా ఉంటున్నాడని, అయితే కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని పేర్కొన్నారు. పలకరిస్తే ప్రతిస్పందన చూపించడం లేదన్నారు. DEC 4న ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగ్గా శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News July 7, 2025

మళ్లీ బుల్లితెరపైకి స్మృతి.. ఫస్ట్ లుక్ విడుదల

image

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి టీవీ అభిమానులను అలరించనున్నారు. ‘క్యూంకి సాస్ భి కభీ బహు థి’ సీజన్-2లో ఆమె ఫస్ట్ లుక్‌ తాజాగా విడుదలైంది. 25ఏళ్ల తర్వాత ఈ షోలో ‘తులసి విరానీ’ పాత్రలో కనిపించనున్నారు. గతంలోనూ ఆమె ఇందులో నటించారు. ఆపై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కేంద్రమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. జైబోలో తెలంగాణ(2011) మూవీలోనూ స్మృతి నటించారు.

News July 7, 2025

నేను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌ను: రాణా

image

ఢిల్లీలో NIA కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల ఘటన సూత్రధారి తహవూర్ <<16245394>>రాణా <<>>సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌నని, లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ పొందినట్లు చెప్పాడు. ముంబైలోని పలు ప్రముఖ ప్రాంతాలను పరిశీలించి పాక్ ISIతో కలిసి పేలుళ్లకు ప్లాన్ చేశానన్నాడు. అంతకుముందు గల్ఫ్ వార్ సమయంలో పాక్ ఆర్మీ తనను సౌదీకి పంపిందన్నాడు. కాగా రాణాను US నుంచి తీసుకొచ్చి విచారిస్తున్న విషయం తెలిసిందే.

News July 7, 2025

ముల్డర్ సరికొత్త చరిత్ర

image

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.