News January 29, 2025

ఈ సెంచరీ వారిద్దరికి అంకితం: త్రిష

image

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో నమోదు చేసిన సెంచరీని తన అమ్మనాన్నకు అంకితమిస్తున్నట్లు భారత ప్లేయర్ త్రిష తెలిపారు. నాన్న ముందే సెంచరీ చేయడం చాలా ప్రత్యేకంగా ఉందన్నారు. తాను 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాలనే పట్టుదలతో ఇన్నింగ్సు ఆడినట్లు తెలిపారు. గత WCలోనే సెంచరీ చేయాలని అనుకున్నా ఇప్పటికి కుదిరిందని పేర్కొన్నారు. టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ తనకు ఐడల్ అని చెప్పుకొచ్చారు.

Similar News

News February 1, 2026

ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాక్

image

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. నిన్న జరిగిన రెండో టీ20లో 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 198/5 రన్స్ చేయగా ఆసీస్ 108 రన్స్‌కే ఆలౌటైంది. తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 2018 తర్వాత ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవడం పాకిస్థాన్‌కు ఇదే తొలిసారి. మూడో టీ20 ఇవాళ జరగనుంది.

News February 1, 2026

పాక్‌లో దాడులు.. 125 మంది మృతి

image

పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన <<19013238>>దాడుల్లో<<>> 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.

News February 1, 2026

ప్రకృతి సేద్యంలో చీడపీడల కట్టడి ఎలా?

image

పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విధానంలో కూడా చీడపీడల సమస్య ఉంటుంది. రసం పీల్చే పురుగులు, ఆకుముడత, కాండం, కాయతొలిచే పురుగులు, వేరు పురుగుల ఉద్ధృతి కనిపిస్తోంది. వీటిని బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రాలతో కట్టడి చేయవచ్చు. ఈ సహజ పురుగు మందుల తయారీ విధానం, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.