News March 18, 2024

HYD: ఢీకొట్టిన ట్రైన్.. కాళ్లు తెగి వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అల్వాల్‌లో నివాసం ఉండే కే.దుర్గయ్య(41) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సనత్‌నగర్-అమ్ముగూడ రైల్వేస్టేషన్ల మధ్య అతడు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగి, చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News September 9, 2025

బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News September 9, 2025

పన్ను వసూళ్లకు GHMCకు కొత్త టెక్నిక్!

image

GHMC తన ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. TGSPDCL సహకారంతో ఆస్తి పన్ను ఐడీ నంబర్లను (PTIN) విద్యుత్ కనెక్షన్లతో (USC) అనుసంధానం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 6 GHMCలోని జోన్లలో గణనీయమైన పురోగతి సాధించింది. 96,938 నివాస ఆస్తుల పన్ను ఐడీలు విజయవంతంగా వాణిజ్య విద్యుత్ కనెక్షన్లతో అనుసంధానం అయ్యాయని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు.

News September 9, 2025

HYD: ఇది మరో ‘రాజావారి చేపల చెరువు’

image

రాజావారి చేపల చెరువు మూవీ మెసేజ్‌ను తలపించిందీ ఘటన. ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్‌తో SBI బ్యాంకు నుంచి రూ.6 కోట్లు తీసుకున్న నిందితులు ఎట్టకేలకు బుక్కయ్యారు. నెక్నాంపూర్‌లో లేని ల్యాండ్ ఉందని ఫేక్ డాక్యుమెంట్స్‌ సిద్ధం చేసి నగదు తీసుకున్నట్లు తేల్చిన సైబరాబాద్ EOW అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన నిందితులు చాటెడ్ అకౌంటెంట్ నారాయణ, రవి అరెస్ట్ అయ్యారు.