News January 29, 2025
కుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గయకు(బీహార్) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07095 కాకినాడ టౌన్- గయ రైలును ఫిబ్రవరి 8న, నం.07096 గయ- విజయవాడ ఫిబ్రవరి 10న నడుపుతున్నామంది. నం.07095 రైలు 8న సాయంత్రం 7.35కి విజయవాడ చేరుకుని 10న ఉదయం 10 గంటలకు గయ చేరుకుంటుందని, 10న నం.07096 రైలు మధ్యాహ్నం 2.15కి బయలుదేరి 12న సాయంత్రం 4కి విజయవాడ చేరుకుంటుందని తెలిపింది.
Similar News
News November 7, 2025
అనకాపల్లి రైలు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

దక్షిణ రైల్వే ప్రకటించిన పండగ ప్రత్యేక రైళ్లకు అదనపు హాల్ట్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్ – బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైళ్లకు అనకాపల్లితో పాటు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్ స్టాప్లు కల్పించారు. అరకు – యలహంక, శ్రీకాకుళం రోడ్-బెంగళూరు కంటోన్మెంట్, సంబల్పూర్, కటక్ ప్రత్యేక రైళ్లకు కూడా అదనపు నిలుపుదల చేస్తూ గురువారం అధికారులు ప్రకటించారు.
News November 7, 2025
సంగారెడ్డి: ఈనెల 20 నుంచి బడి బయట పిల్లల సర్వే

జిల్లాలో ఈనెల 20 నుంచి 31 డిసెంబర్ వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల పరిధిలోని గ్రామాల్లో, ఆవాస ప్రాంతాల్లో 6-14 సంవత్సరాలలోపు బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రబంధ పోర్టర్లో నమోదు చేయాలని సూచించారు.
News November 7, 2025
పెద్ది నుంచి లిరికల్ కాదు.. వీడియో సాంగ్

టాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్టర్ బుచ్చిబాబు ‘చికిరి చికిరి’ అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్ను ఇవాళ ఉదయం 11.07కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అందరూ అనుకున్నట్లు లిరికల్ సాంగ్ను కాకుండా వీడియో సాంగ్నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పెద్ది చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ SMలో పేర్కొంది.


