News March 18, 2024
నాలుగు నెలల మనవడికి మూర్తి రూ.240కోట్లు గిఫ్ట్!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం మూర్తి షేర్లు 0.40% నుంచి 0.36శాతానికి తగ్గాయి. కాగా గత ఏడాది నవంబరులో నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి-అపర్న కృష్ణన్ దంపతులు ఏకగ్రహకు జన్మనిచ్చారు.
Similar News
News September 30, 2024
సీఎం సోదరుడి ఇల్లు ఎందుకు కూల్చడంలేదు: KTR
TG: ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. ‘40-50 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను పడగొడతామంటే నీ అయ్య జాగీర్ కాదని గుర్తుచేస్తున్నా. HYDలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని KTR తెలిపారు.
News September 30, 2024
బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం: KTR
TG: ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇళ్లు కూలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు. పేదల ఇళ్లు కూలుస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. నాతో సహా మా నేతలంతా బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషన్ కార్యాలయం, బుద్ధభవన్ను కూల్చాలి’ అని కేటీఆర్ మండిపడ్డారు.
News September 30, 2024
చరిత్ర సృష్టించిన బుమ్రా
బంగ్లాదేశ్తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్గా బుమ్రా నిలిచారు. దీంతో పాటు జేమ్స్ అండర్సన్ను అధిగమించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC)లో అత్యధిక వికెట్లు తీసిన ఏడవ బౌలర్గా బుమ్రా రికార్డులకెక్కారు.