News January 30, 2025

సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత

image

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గురువారంతో 420 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయాలని కోరారు.

Similar News

News December 29, 2025

అప్పన్న హుండీ ఆదాయం రూ.22 కోట్లు

image

సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంకి 2025(మార్చి–డిసెంబరు) మధ్య భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ. 22,13,49,039 ఆదాయం సమకూరింది. ప్రతి 15 నుంచి 20 రోజులకోసారి హుండీల లెక్కింపు చేపడతారు. నగదు, విదేశీ కరెన్సీ, బంగారం, వెండి ఆభరణాల రూపంలో ఆదాయం లభించింది. ఇటీవల 21 రోజుల తర్వాత ఈ నెల DEC 25న నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.1.54 కోట్లు ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.

News December 29, 2025

సీరియల్ నటి నందిని ఆత్మహత్య

image

ప్రముఖ కన్నడ-తమిళ్ సీరియల్ నటి నందిని(26) సూసైడ్ చేసుకున్నారు. బెంగళూరులోని తన ఫ్లాట్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్‌‌లో పాపులర్ అయిన ‘గౌరీ’ సీరియల్‌లో దుర్గ, కనకగా ఆమె డబుల్ రోల్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని పెళ్లి విషయంలో పేరెంట్స్ ఒత్తిడి చేయడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

News December 29, 2025

వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

image

వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 70,416 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 3,729, ఎస్సీ జనాభా 6,836గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.