News March 18, 2024
ఇది యూకేజీ ఫీజా.. ఆస్తులు అమ్మాల్సిందే!
పిల్లల్ని కిండర్గార్టెన్(కేజీ) చదివించాలంటే సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చు. అంతేకదా..? కానీ ఓ పాఠశాలలో మాత్రం అక్షరాలా రూ.2,72,718 కట్టాల్సి ఉంటుంది. అందులో రూ.33వేలు తర్వాత రిఫండ్ ఇస్తారట. దీనికి సంబంధించి ఓ ఫొటో వైరల్ అవుతోంది. ‘ఇది యూకేజీ ఫీజా..? పిల్లల్ని ఇలా చదివించాలంటే మా ఆస్తులు అమ్మాల్సిందే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 30, 2024
ఏపీ ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు
లడ్డూ వివాదంలో AP ప్రభుత్వం తీరును SC ఆక్షేపించింది. ‘ఈ వివాదంపై Sep 18న ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. Sep 25న FIR నమోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచారణ పూర్తవ్వకముందే మనోభావాలు దెబ్బతీసేలా మీడియా ముందు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించింది. లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.
News September 30, 2024
లడ్డూ వివాదం.. SC వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందన
తిరుమల లడ్డూ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అన్న వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. SC స్టేట్మెంట్ను పోస్ట్ చేశారు. కాగా లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకుండా దర్యాప్తు చేయాలని ఇటీవల ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
News September 30, 2024
సీఎం సోదరుడి ఇల్లు ఎందుకు కూల్చడంలేదు: KTR
TG: ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. ‘40-50 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను పడగొడతామంటే నీ అయ్య జాగీర్ కాదని గుర్తుచేస్తున్నా. HYDలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని KTR తెలిపారు.