News January 30, 2025
వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని జిల్లా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గత మూడు, నాలుగు నెలల నుంచి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Similar News
News December 27, 2025
జనవరి 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే: విశాఖ కలెక్టర్

విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రతి ఫైల్ను ఈ-ఆఫీస్ విధానంలోనే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిజికల్ ఫైళ్లకు స్వస్తి పలికి, జనవరి 15 నుంచి ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్లైన్లోనే అందించాలని స్పష్టం చేశారు. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (95523 00009)పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అధికారులకు సూచించారు.
News December 27, 2025
కేజీబీవీ విద్యార్థినులకు కాస్మెటిక్ ఛార్జీల విడుదల

శ్రీ సత్యసాయి జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలను జమ చేసినట్లు ఏజీసీడీఓ అనిత తెలిపారు. జిల్లాలోని 30 విద్యాలయాల్లో చదువుతున్న 7,735 మంది విద్యార్థినులకు గానూ రూ.77.35 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే 10, 11, 12 తరగతుల విద్యార్థినుల పరీక్షల రవాణా ఖర్చుల నిమిత్తం మరో రూ.10.24 లక్షలు జమ అయినట్లు ఆమె వెల్లడించారు.
News December 27, 2025
ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.


