News January 30, 2025

కామారెడ్డి: ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి పని కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 70% ఆస్తి పన్ను వసూలు చేసినట్లు తెలిపారు. మిగత పెండింగ్ వచ్చే నెల 15 లోగా పూర్తి చేయాలన్నారు. రానున్న వేసవి దృష్టా తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News March 14, 2025

కాటారం: అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

image

కాటారం శివారులో చింతకాని క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గతరాత్రి లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది.  నిద్రమత్తులో లారీని డివైడర్ పైకి ఎక్కించినట్లు స్థానికులు తెలిపారు. ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసమైంది.

News March 14, 2025

IPL-2025లో కెప్టెన్లు

image

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్

News March 14, 2025

MBNR: రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సీసీ కుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. పార్దిపూర్ గ్రామానికి చెందిన రాజు (31) నిన్న సాయంత్రం బైక్‌పై లాల్ కోట వైపు వెళ్తున్నాడు. పర్దిపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ నాయక్ బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనగా రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

error: Content is protected !!