News January 30, 2025
సిద్దిపేట: ‘డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి’

సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్స్ హల్లో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ సంభందించిన డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ గూర్చి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో చర్చించారు.
Similar News
News November 10, 2025
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 09. లైబ్రేరియన్ – 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1, ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1, లాబొరేటరీ అసిస్టెంట్ (విద్య) -1, లాబొరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ & టెక్నాలజీల్యాబ్) -1, అప్పర్ డివిజన్ క్లర్క్ -1, లైబ్రరీ అటెండెంట్ -2, గ్రూప్ C -1. ఈనెల 30 లాస్ట్ డేట్. వివరాలకు https://nsktu.ac.in/ ని సంప్రదించండి.
News November 10, 2025
వెల్దుర్తి: పెద్దపులి దాడిలో రెండు గేదెలు మృతి.?

వెల్దుర్తి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వజ్రాలపాడు తండా సమీపంలో పెద్దపులి దాడి ఘటన కలకలం రేపింది. మూఢావత్ తులస్యానాయక్ గేదె శనివారం, మరో గేదె ఆదివారం మృత్యువాత పడ్డాయి. రేంజర్ సుజాత మాట్లాడుతూ.. పశువులను అడవిలోకి పంపవద్దని, రాత్రి వేళ పెట్రోలింగ్ కొనసాగుతోందని చెప్పారు. ట్రాప్ కెమెరాలు, పాదముద్రల ద్వారా పులి కదలికలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
News November 10, 2025
గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్లో అమ్మింది 40 కార్లే

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.


