News January 30, 2025
పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

పిట్లం మండల కేంద్రానికి చెందిన ఆరేటి కిరణ్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆరేటి కిరణ్ బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లాకు వెళ్లారు. బుధవారం మేడ్చల్లోని చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు వివరించారు.
Similar News
News September 19, 2025
వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
News September 19, 2025
కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్చాట్లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్దే తుది నిర్ణయమన్నారు.
News September 19, 2025
HYD: బతుకమ్మ వేడుక.. బస్సులు సిద్ధం ఇక..!

బతుకమ్మ వేడుకలు.. దసరా సెలవులు త్వరలో రానుండటంతో సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. MGBS, ఆరాంఘర్, జేబీఎస్, KPHB కాలనీ, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు. SHARE IT