News January 30, 2025

పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

image

పిట్లం మండల కేంద్రానికి చెందిన ఆరేటి కిరణ్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆరేటి కిరణ్ బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లాకు వెళ్లారు. బుధవారం మేడ్చల్‌లోని చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు వివరించారు.

Similar News

News July 5, 2025

తోటపల్లి కాలువ ఖరీఫ్ సాగునీటిని విడుదల చేయనున్న మంత్రి

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం నుంచి ఖరీఫ్‌కు ఈనెల 6న మంత్రి సంధ్యారాణి నాగావళి సాగునీటిని విడుదల చేస్తారని అధికారులు తోటపల్లి ప్రాజెక్ట్ AE నవీన్ వెల్లడించారు. మండలంలోని ఉల్లిభద్ర సమీప కుడి ప్రధాన కాలువ సున్నా పాయింట్ డైక్ వద్ద మంత్రి గేట్ల వద్ద బటన్ నొక్కి నాగావళి నీరు విడుదల చేస్తారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

News July 5, 2025

మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో చేపట్టిన మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. ఆసిఫాబాద్‌లో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను పంచాయతరాజ్ ఈఈ అజ్మీర కృష్ణతో కలిసి పరిశీలించారు. ఆర్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.

News July 5, 2025

DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?