News January 30, 2025

జగిత్యాల: సీనియర్ సిటిజన్ల పోస్ట్ కార్డు ఉద్యమం

image

తమ డిమాండ్ల పరిష్కారానికి జగిత్యాల జిల్లాలోని సీనియర్ సిటిజన్‌లు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి సైకిల్ లపై వెళ్లి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులకు పోస్ట్ కార్డులు వేశారు. ఈ కార్యక్రమంలో గౌరీశెట్టి విశ్వనాధం, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 15, 2025

HYD: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

image

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలపై ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 20 రోజులుగా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది. అనంతరం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో రూ.140 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 15, 2025

తాండూరు వాసికి గోల్డ్ మెడల్‌

image

వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ రవిశంకర్ బంగారు పతకాన్ని సాధించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఓపెన్ పికిల్ బాల్ ఛాంపీయన్ షిప్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. స్టేట్ లెవెల్లో సత్తా చాటిన విధంగా జాతీయ స్థాయిలో కూడా గొల్డ్ మెడల్ తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పటేల్ రవిశంకర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

News September 15, 2025

ADB: జలధారలు.. మృత్యు ఘోషలు

image

అసలే వానాకాలం.. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పుడు అటువైపు వెళ్లకూడదని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. మొన్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబాలో నలుగురు నీటికి బలయ్యారు. నిన్న కుంటాల జలపాతం వద్ద ఇద్దరు ఇరుక్కున్నారు. సమయానికి పోలీసులు స్పందించి వారిని కాపాడారు. అందుకే జాగ్రత్తగా ఉందాం.. ప్రాణాలను కాపాడుకుందాం. కుటుంబం కంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ కాదూ.