News January 30, 2025
ఒంగోలు: మద్యం తాగి వచ్చిన వారికి నో టోకెన్

ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్న క్యాంటీన్ వద్దకు ఎందరో ప్రజలు తమ ఆకలిని తీర్చుకునేందుకు వస్తుంటారు. అదే సమయానికి పలువురు మద్యం ప్రియులు అన్న క్యాంటీన్ వద్ద హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు ఓ బోర్డును ఏర్పాటు చేశారు. మద్యం తాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వడం కుదరదని ఆ బోర్డు సారాంశం.
Similar News
News March 13, 2025
ప్రకాశం: సమస్యాత్మకంగా 6 పరీక్షా కేంద్రాలు

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొమరోలు గవర్నమెంట్ హైస్కూల్, బెస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల, పెద్దారవీడు మండలం వైడిపాడు, అర్ధవీడు మండలం మాచవరం, రాచర్ల, CSపురం జిల్లా పరిషత్ పాఠశాలలను సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
News March 13, 2025
ప్రకాశం: రూ.40లక్షల ఉద్యోగం.. అయినా సూసైడ్

గిద్దలూరులో హైటెన్షన్ కరెంట్ వైర్ పట్టుకున్న విద్యార్థి చనిపోయాడు. కంభం(M) రావిపాడుకు చెందిన అమరనాథ్(22) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రూ.40 లక్షల జీతంతో జాబ్కు సెలెక్టయ్యాడు. HYDలో అన్నను చూసొస్తానని చెప్పి వెళ్లాడు. అన్నను కలవకుండానే ఫ్రెండ్తో కలిసి నిన్న గిద్దలూరు వచ్చాడు. ఫ్రెండ్ని వాటర్ బాటిల్కి పంపి అతను గూడ్స్ రైలెక్కి వైర్లు పట్టుకున్నాడు. కర్నూలులో చికిత్స పొందుతూ చనిపోయాడు.
News March 13, 2025
జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదేమో..?: స్వామి

జగన్ పెట్టిన బకాయిలకు ఆయనే ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి స్వామి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ రూ.4,271 కోట్ల బకాయి పెట్టింది జగన్ కాదా? ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడానికి.. ఇలా ధర్నాకు పిలుపు ఇవ్వడమే నిదర్శనం. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదు. మేము ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుండటంతో ధర్నాలు చేసుకుంటున్నారు’ అని మంత్రి అన్నారు.