News January 30, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్: కలెక్టర్

image

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి కోరారు. బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరణ, ఫిబ్రవరి 10న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.

Similar News

News January 13, 2026

కర్నూలు జిల్లాకు వాటితో ముప్పు..!

image

కర్నూలు జిల్లాలోని రెండు మండలాల భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు ‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు’ తాజాగా హెచ్చరించింది. దేవనకొండ మండలం కరివేములలో అత్యధికంగా 50.7 ppb సాంద్రత నమోదవ్వగా, ఆదోని మండలం నాగనాథనహల్లిలో 63.6 ppb ఉన్నట్లు గుర్తించారు. 30 ppbలోపు ఉంటేనే సురక్షితమని, ఇంతటి భారీ సాంద్రత వల్ల కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News January 13, 2026

పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

image

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.

News January 13, 2026

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

image

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాల దొంగతనాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.