News January 30, 2025
సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు

సీపీఎం రాష్ట్ర కమిటీలో సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర మహాసభలో మల్లు లక్ష్మి మూడోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మల్లు నాగార్జున్ రెడ్డి మూడో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నూతనంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావులను ఎన్నుకున్నారు.
Similar News
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 6, 2025
ముగిసిన తొలి విడత పోలింగ్

బిహార్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.
News November 6, 2025
కృష్ణా: పీజీ, ఎంటెక్ పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు సంబంధించి PG LLM 4వ సెమిస్టర్, ఎంటెక్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా. పి.వి బ్రహ్మచారి తెలిపారు. రెండు కోర్సుల్లోనూ 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. పునః మూల్యాంకనం కోసం ఈ నెల 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను www.kru.ac.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు.


