News January 30, 2025

KTDM: ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొదలైన కోలాహలం

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవడంతో కోలాహలం మొదలైంది. కాగా ఇటీవలే ఈ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తైంది. కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల పరిధిలో 23 పోలింగ్ బూత్‌ల పరిధిలో 1,949 మంది ఓటర్లుగా తేలారు. ఇందులో పురుషులు 1,038 మహిళలు 941 మంది ఉన్నారు. ఈ నెల 31 వరకు ఓటు నమోదుకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News November 15, 2025

బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.

News November 15, 2025

కామారెడ్డి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు గ‌డువును పొడిగించినట్లు కామారెడ్డి DEO రాజు తెలిపారు. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ప‌రీక్షా ఫీజు చెల్లించవచ్చ‌ని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. రూ.200 లేట్‌ ఫీజుతో DEC 2 నుంచి 11 వరకు, రూ.500 లేట్‌ ఫీజుతో DEC 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

News November 15, 2025

జగిత్యాల: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడి భార్యను హత్య చేసిన భర్తకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి నారాయణ జీవిత ఖైదుతో పాటు రూ.పది వేల జరిమానా విధించారు. మెట్‌పల్లికి చెందిన వాల్గోట్ కిశోర్(32) భార్య నిషిత(28)ను 28-12-2021న ఇంట్లో గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం శిక్షను అమలు చేశారు.