News January 30, 2025
తిరుమలలో ఫిబ్రవరిలో ప్రత్యేక కార్యక్రమాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో ప్రత్యేక కార్యక్రమాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. ఫిబ్రవరి 02న వసంత పంచమి, ఫిబ్రవరి 04న రథసప్తమి, ఫిబ్రవరి 05న భీష్మాష్టమి, ఫిబ్రవరి 06న మాధ్వ నవమి, ఫిబ్రవరి 08న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ జరగనుంది. ఫిబ్రవరి 24న సర్వ ఏకాదశి, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు.
Similar News
News January 11, 2026
సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
News January 11, 2026
NGKL జిల్లాలో 1,008 టన్నుల యూరియా నిల్వలు: కలెక్టర్

నాగర్కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 1,008 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలకు గాను జిల్లాకు 6,619 టన్నుల యూరియా కేటాయించబడిందని, జడ్చర్ల, గద్వాల పాయింట్ల ద్వారా ఇది సరఫరా అవుతుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 300 ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
News January 11, 2026
SSS: డెడ్ బాడీని పీక్కుతిన్న జంతువులు..?

పుట్టపర్తి – నారాయణపురం రైల్వే స్టేషన్ల మధ్య కొత్తచెరువు (M) లోచర్ల సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఓ పురుషుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడికి సుమారు 50-60 ఏళ్ల వయసుంటుందన్నారు. అతని ఎత్తు 5.6 అడుగులు ఉన్నాడన్నారు. అతణ్ని అడవి జంతువులు పీక్కు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు.


