News January 30, 2025
MBNR: తల్లి నిద్రలేచేసరికి.. దూలానికి వేలాడుతూ కొడుకు

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసునమోదు చేశారు.
Similar News
News February 27, 2026
డోంట్ వర్రీ.. పులి కదలికల్ని గమనిస్తున్నాం: రంప FRO

పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం అటవీ డివిజన్లోని రంప, పెద్దకొండ, సూదికొండ, భీమవరం అటవీ సమీప గ్రామాలలో అటవీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పులి కదలికలు డ్రోన్ థెర్మల్ ఇమేజ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఆందోళన చెందవద్దని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు..
News February 27, 2026
మార్చి 3న కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు నిలిపివేత

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదిన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30వరకు కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ శోభారాణి తెలిపారు. ఆరోజు ఉదయం పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేయనున్నట్టు తెలిపారు. గ్రహణానంతరం రాత్రి సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 27, 2026
ఇళ్లు రాని వాళ్లంతా అప్లై చేసుకోవాలి: CBN

AP: పేదలందరికీ 2029 నాటికి ఉచితంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామని CM CBN అసెంబ్లీలో వెల్లడించారు. ‘ఇళ్లు రాని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలి. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారికి పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం ఈ ఏడాదిలో 10.63 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తాం. గత పాలకులు హౌసింగ్లో అక్రమాలు చేశారు. ఇందుకు బాధ్యులను శిక్షిస్తాం’ అని పేర్కొన్నారు.


