News January 30, 2025

ములుగు: ‘బోనస్’ కోసం రైతుల ఎదురుచూపులు!

image

ములుగు జిల్లాలో రైతులు వరి ధాన్యం బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. నెలన్నర దాటిన తమ ఖాతాలో బోనస్ జమ కాలేదని వాపోతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11,379 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించగా 4,885 మంది రైతులకు మాత్రమే రూ.15.64 కోట్లు చెల్లించారు. 6,494 మంది రైతులు తమకు రావాలసిన రూ.19.36 కోట్ల బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బోనస్ ఖాతాలలో జమ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Similar News

News January 12, 2026

నల్గొండ: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. CSతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News January 12, 2026

NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.

News January 12, 2026

వికారాబాద్: ఎన్నికలకు సిద్ధం కండి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ఓటర్ లిస్ట్ తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.